Saturday, April 30, 2011

సంగమయుగంలో పిల్లలైన మీరు చేసుకునే ఈ సంపాదనయే సత్యమైన సంపాదన. అది ఎలా?

మధురమైన పిల్లలూ - పావనముగా అయినట్లైతే ఆత్మికసేవకు అర్హులుగా అవుతారు. దేహీ అభిమానులైన పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటారు మరియు ఇతరులచేతకూడా ఈ యాత్రనే చేయిస్తారు.

ప్రశ్న: సంగమయుగంలో పిల్లలైన మీరు చేసుకునే ఈ సంపాదనయే సత్యమైన సంపాదన. అది ఎలా?

జవాబు: ఇప్పుడు మీరు సంపాదించుకునే ఈ సంపాదన 21 జన్మలు కొనసాగుతుంది. ఇది ఎప్పుడూ దివాలా తీయదు. ఙ్ఞానము వినడం , వినిపించడం, స్మృతిచేయడం మరియు చేయించడం.... ఇదే సత్యమైన సంపాదన. ఈ సంపాదనను సత్యమైన తండ్రియే మీకు నేర్పిస్తున్నారు. ఇటువంటి సంపాదనను మొత్తం కల్పమంతటిలో ఎవరూ చేసుకోలేరు. ఇంకే ఇతర సంపాదన మీతో పాటు వెళ్ళదు.

గీతము: మేము ఆ మార్గం గుండా వెళ్ళాలి.....

ధారణకొరకు ముఖ్యసారము:

1.ఈశ్వరీయజీవితం చాలా చాలా అమూల్యమైనది. ఈ జీవితంలో ఆత్మ మరియు శరీరం రెండిటినీ పావనంగా తయారుచేసుకోవాలి. ఆత్మిక యాత్రలో ఉంటూ ఇతరులకు కూడా ఈ యాత్రను నేర్పించాలి.

2. ఎంత వీలైతే అంత ఈ సత్యమైన సంపాదనలో నింగ్నమవ్వాలి. నిరోగులుగా అయ్యేందుకు స్మృతిలో దృఢంగా అవ్వాలి.

వరదానము: స్మృతి ఆధారము ద్వారా మాయచెత్త నుండి అతీతంగా అయ్యే సదా హర్షితముఖ భవ.

స్లోగన్: పవిత్రత యొక్క ధారణను లేక ధర్మమును జీవితములోకి తీసుకువచ్చేవారే మహాన్ ఆత్మలు.

Friday, April 29, 2011

ఙ్ఞానపు పాయింట్లను ప్రతిరోజూ రివైజ్ చేసుకొని సమాధాన స్వరూపులుగా అయ్యే బేగంపూర్ బాద్‌షా భవ.

మధురమైన పిల్లలూ - మీకు ఎప్పుడు సమయం దొరికినా ఏకాంతంలో కూర్చొని సత్యమైన ప్రియుణ్ణి స్మృతిచేయండి. ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది.

ప్రశ్న: బాబా లభించిన తర్వాత ఏ నిర్లక్ష్యము సమాప్తమైపోవాలి?

జవాబు: కొందరు పిల్లలు ఎటుతిరిగీ బాబాకు చెందినవారమే కదా అని నిర్లక్ష్యముతో అంటారు. వారు స్మృతిచేసేందుకు పురుషార్ధం చేయరు. ఘడియ ఘడియ స్మృతిని మర్చిపోతూ ఉంటారు. ఇదే నిర్లక్ష్యము. పిల్లలూ, మీరు స్మృతిలో ఉన్నట్లైతే మీకు లోలోపల స్థిరమైన సంతోషము ఉంటుంది. ఏ విధమైన కునుకుపాట్లూ రావు. ఏ విధంగా బంధనాలలో ఉన్న మాతలు స్మృతిలో తపిస్తూ ఉంటారో, రాత్రింబవళ్ళు స్మృతి చేస్తారో అలాగే మీరు కూడా నిరంతరం స్మృతి చేయాలి.

ధారణకొరకు ముఖ్యసారము:

1. ప్రతి కార్యమునూ చేస్తూ ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసమును చేయాలి. దేహపు అహంకారం సమాప్తమయ్యేందుకు పురుషార్ధం చేయాలి.

2. సత్యయుగ రాజ్యమునకు అర్హులుగా అయ్యేందుకు మీ నడవడికను రాయల్‌గా చేసుకోవాలి. పవిత్రతయే అన్నిటికన్నా ఉన్నతమైన నడవడిక, పవిత్రంగా అవ్వడంద్వారానే పవిత్ర ప్రపంచానికి అర్హులుగా అవుతారు.

వరదానము: ఙ్ఞానపు పాయింట్లను ప్రతిరోజూ రివైజ్ చేసుకొని సమాధాన స్వరూపులుగా అయ్యే బేగంపూర్ బాద్‌షా భవ.

స్లోగన్: ప్రతి ఒక్కరికీ గౌరవమునివ్వడమే గౌరవమును పొందడము.

Thursday, April 28, 2011

వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిశ్తారూపపు సాక్షాత్కారమును చేయించే శ్వేతవస్త్రధారీ మరియు శ్వేత ప్రకాశధారీ భవ.

మధురమైన పిల్లలూ - బాబా వద్ద ఏ ఙ్ఞానమైతే ఉందో అది మీకు పూర్తిగా లభించింది. మీరు దానిని స్వయం ధారణచేసి ఇతరులచేత కూడా చేయించండి.

ప్రశ్న: త్రికాలదర్శి అయిన బాబా డ్రామా ఆదిమధ్యాంతములు తెలిసి ఉండి కూడా రేపటి విషయాన్ని ఈ రోజు చెప్పరు. ఎందుకు?

జవాబు: పిల్లలూ - నేను ముందే చెప్పినట్లైతే ఈ డ్రామాలో ఉన్న మజా అంతా పోతుంది. కావున అలా చెప్పడం 'లా'లో లేదు అని బాబా అంటారు. నేను అన్నీ తెలిసి ఉండి కూడా డ్రామాకు వశమై ఉన్నాను. నేను ముందుగా వినిపించలేను కావున ముందు ఏం జరుగుతుంది అన్న చింతను వదిలివేయండి.

జవాబు: నీదారిలోనే జీవించాలి, నీ దారిలోనే మరణించాలి......

ధారణకొరకు ముఖ్యసారము:

1. దేవతలుగా అయ్యేందుకు ఆహారపానీయాలను చాలా శుద్ధముగా ఉంచుకోవాలి, చాలా పత్యముతో నడుచుకోవాలి. యోగశక్తి ద్వారా భోజనానికి దృష్టిని ఇచ్చి దానిని శుద్ధిచేసి స్వీకరించాలి.

2. మేము పరమపిత పరమాత్మకు పిల్లలము లేక విద్యార్ధులము. వారు ఇప్పుడు మనల్ని మన ఇంటికి తీసుకువెళతారు అన్న ఈ నషాలో ఉంటూ పరమ సుఖాన్ని, పరమానందాన్ని అబుభవం చేసుకుంటూ ఉండాలి.

వరదానము: వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిశ్తారూపపు సాక్షాత్కారమును చేయించే శ్వేతవస్త్రధారీ మరియు శ్వేత ప్రకాశధారీ భవ.

స్లోగన్: సర్వగుణాలూ మరియు సర్వశక్తులకు అధికారులుగా అయ్యేందుకు ఆఙ్ఞాకారులుగా అవ్వండి.

Wednesday, April 27, 2011

డ్రామా పాయింట్ యొక్క అనుభవం ద్వారా సదా సాక్షీస్థితి యొక్క స్టేజ్‌పై ఉండే అచల-స్థిర భవ.

మధురమైన పిల్లలూ - తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతిచేసినట్లైతే రమణీయంగా అవుతారు. బాబా రమణీయంగా ఉన్నారు కావున వారి పిల్లలు కూడా రమణీయంగా ఉండాలి.

ప్రశ్న: దేవతల చిత్రాలు అందరినీ ఎందుకు ఆకర్షిస్తాయి? వారిలో ఏ విశేషగుణము ఉంది?

జవాబు: దేవతలు చాలా రమణీయంగా, పవిత్రంగా ఉంటారు. ఆ రమణీయత కారణంగా వారి చిత్రాలు కూడా అందరినీ ఆకర్షిస్తాయి. దేవతల్లో పవిత్రత యొక్క విశేషగుణము ఉంటుంది. ఆ గుణము కారణముగానే అపవిత్ర మనుష్యులు వారి ముందు తలవంచుతారు. ఎవరిలోనైతే సర్వ దైవీగుణాలు ఉంటాయో వారే రమణీయంగా ఉంటారు. వారు సదా సంతోషంగా ఉంటారు.

ధారణకొరకు ముఖ్యసారము:

1.ఇప్పుడు మనం వనవాసంలో ఉన్నాము. కావున చాలా చాలా సాధారణంగా ఉండాలి. దేహం లేక వస్త్రాలు మొదలైన వాటి అభిమానం కొద్దిగా కూడా ఉండకూడదు. ఏ కర్మ చేస్తున్నా బాబా స్మృతి యొక్క నషా ఉండాలి.

2. మనం అనంతమైన త్యాగులం మరియు రాజర్షులం. ఈ నషాలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. ఙ్ఞానధనంతో సంపన్నంగా అయి దానంచేయాలి. సత్యమైన వ్యాపారస్తులుగా అయి మీ లెక్కాచారాలను వ్రాసుకోవాలి.

వరదానము: డ్రామా పాయింట్ యొక్క అనుభవం ద్వారా సదా సాక్షీస్థితి యొక్క స్టేజ్‌పై ఉండే అచల-స్థిర భవ.

స్లోగన్: ఎవరైతే సమయమును అమూల్యముగా భావిస్తూ సఫలం చేసుకుంటారో వారు సమయానికి మోసపోరు.