Friday, April 29, 2011

ఙ్ఞానపు పాయింట్లను ప్రతిరోజూ రివైజ్ చేసుకొని సమాధాన స్వరూపులుగా అయ్యే బేగంపూర్ బాద్‌షా భవ.

మధురమైన పిల్లలూ - మీకు ఎప్పుడు సమయం దొరికినా ఏకాంతంలో కూర్చొని సత్యమైన ప్రియుణ్ణి స్మృతిచేయండి. ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది.

ప్రశ్న: బాబా లభించిన తర్వాత ఏ నిర్లక్ష్యము సమాప్తమైపోవాలి?

జవాబు: కొందరు పిల్లలు ఎటుతిరిగీ బాబాకు చెందినవారమే కదా అని నిర్లక్ష్యముతో అంటారు. వారు స్మృతిచేసేందుకు పురుషార్ధం చేయరు. ఘడియ ఘడియ స్మృతిని మర్చిపోతూ ఉంటారు. ఇదే నిర్లక్ష్యము. పిల్లలూ, మీరు స్మృతిలో ఉన్నట్లైతే మీకు లోలోపల స్థిరమైన సంతోషము ఉంటుంది. ఏ విధమైన కునుకుపాట్లూ రావు. ఏ విధంగా బంధనాలలో ఉన్న మాతలు స్మృతిలో తపిస్తూ ఉంటారో, రాత్రింబవళ్ళు స్మృతి చేస్తారో అలాగే మీరు కూడా నిరంతరం స్మృతి చేయాలి.

ధారణకొరకు ముఖ్యసారము:

1. ప్రతి కార్యమునూ చేస్తూ ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసమును చేయాలి. దేహపు అహంకారం సమాప్తమయ్యేందుకు పురుషార్ధం చేయాలి.

2. సత్యయుగ రాజ్యమునకు అర్హులుగా అయ్యేందుకు మీ నడవడికను రాయల్‌గా చేసుకోవాలి. పవిత్రతయే అన్నిటికన్నా ఉన్నతమైన నడవడిక, పవిత్రంగా అవ్వడంద్వారానే పవిత్ర ప్రపంచానికి అర్హులుగా అవుతారు.

వరదానము: ఙ్ఞానపు పాయింట్లను ప్రతిరోజూ రివైజ్ చేసుకొని సమాధాన స్వరూపులుగా అయ్యే బేగంపూర్ బాద్‌షా భవ.

స్లోగన్: ప్రతి ఒక్కరికీ గౌరవమునివ్వడమే గౌరవమును పొందడము.

No comments:

Post a Comment