మధురమైన పిల్లలూ - బాబా సమానముగా దయార్ధ్ర హృదయులుగా అయి అనేకులకు దారిని చూపించండి. ఏ పిల్లలైతే రాత్రింబవళ్ళు సేవలో నిమగ్నమై ఉంటారో వారే ధైర్యవంతులు.
ప్రశ్న: ఉన్నతమైన భ్యాగ్యానికి ముఖ్యమైన ఆధారము ఏ విషయముపై ఉంటుంది?
జవాబు: స్మృతియాత్ర ఎవరు ఎంతగా స్మృతిచేస్తారో అంతగా ఉన్నతమైన భాగ్యము తయారవుతుంది. శరీర నిర్వహణార్ధం కర్మచేస్తూ బాబాను మరియు వారసత్వాన్ని స్మృతిచేస్తూ ఉన్నట్లైతే భాగ్యం ఉన్నతముగా తయారవుతుంది.
గీతము: నా భాగ్యమును మేల్కొలుపుకొని వచ్చాను.....
ధారణకొరకు ముఖ్యసారము:
1. బంధనముక్తులుగా అయి బాబా సేవలో నిమగ్నమవ్వాలి. అప్పుడే ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది. దయార్ధ్రహృదయులుగా అయి అనేకులకు దారిని చూపించాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి.
2. ఈ శరీరముపై మమత్వాన్ని తొలగించుకొని జీవిస్తూ మరణించాలి. ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. జబ్బుచేసినప్పుడు కూడా ఒక్క బాబా స్మృతే ఉన్నట్లైతే వికర్మలు వినాశనమైపోతాయి.
వరదానము: ఆల్మైటీ బాబా యొక్క అథారిటీ ద్వారా ప్రతి కార్యమును సహజంచేసే సదా స్థిరమైన నిశ్చయబుద్ధీ భవ.
స్లోగన్: ఏకాగ్రతా శక్తి పరవశస్థితిని కూడా పరివర్తన చేసేస్తుంది.
No comments:
Post a Comment