మధురమైన పిల్లలూ - ఇప్పుడు ఈ కలియుగము అంతము కానున్నది. కావున మీరు దీనినికాలితో తన్నాలి. మీ ముఖమును స్వర్గమువైపుకు ఉంచాలి.
ప్రశ్న: బాబా తమ పిల్లలకు పుణ్యాత్మలుగా అయ్యేందుకు ఏ విధిని తెలియజేస్తారు?
జవాబు: పుల్లలూ, పుణ్యాత్మలుగా అవ్వాలనుకుంటే ఏ తప్పులూ లేనివారుగా అవ్వండి. రావణుడు మీచే అనేక తప్పులు చేయించాడు. తప్పులు చేస్తూ చేస్తూ మీరు పాపాత్ములుగా అయిపోయారు. క్రోధము లేక కామపు తప్పులను రావణుడు చేయిస్తాడు. ఈ వికారాలపై మిమ్మల్ని విజయులుగా చేసేందుకు బాబా వచ్చారు. ఇప్పుడు మీరు తప్పులు లేనివారుగా అయి నిర్వికారులుగా అవ్వండి.
గీతము: ఆకాశ సింహాసనాన్ని వదలి రా.......
ధారణకొరకు ముఖ్యసారము:
1. మధురాతి మధురమైనవారు ఒక్క శివబాబాయే. వారిని చాలా ప్రేమగా స్మృతిచేయాలి. సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి, ఏ తప్పూ చేయరాదు.
2. ఈ మృత్యులోకంలో ఇప్పుడు ఇది అంతిమ జన్మ. వినాశనం ముందు నిల్చొని ఉంది కావున బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి, పావనులుగా అవ్వాలి.
వరదానము: సదా తోడుగా ఉన్నవారి స్మృతి మరియు సాక్షీ స్థితిని అనుభవం చేసుకునే శివమయీ శక్తిస్వరూప కంబైండ్ భవ.
స్లోగన్: నిర్విఘ్నమైన మరియు ఏకరసమైన స్థితిని అనుభవం చేసుకునేందుకు ఏకాగ్రతను అభ్యాసము చేయండి.
No comments:
Post a Comment