మధురమైన పిల్లలూ - బాబా సమానంగా ప్రియముగా అయ్యేందుకు స్వయాన్ని బిందువైన ఆత్మగా భావిస్తూ బిందువైన బాబాను స్మృతిచేయండి.
ప్రశ్న: స్మృతిలో ఉండేందుకు గుప్తమైన గట్టి పురుషార్ధమును పిల్లలు ప్రతి ఒక్కరూ చేయాలి. ఎందుకు?
జవాబు: ఎందుకంటే స్మృతిచేయకుండా ఆత్మ పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వజాలదు. ఎప్పుడైతే గుప్తమైన స్మృతిలో ఉంటారో, దేహీ అభిమానులుగా అవుతారో అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. ధర్మరాజు శిక్షలనుండి రక్షించుకునేందుకు సాధనం కూడా ఈ స్మృతియే. మాయా తుఫానులు స్మృతిలోనే విఘ్నాలను కలిగిస్తాయి. కావున స్మృతిచేసేందుకు గుప్తమైన పురుషార్ధం చేయండి. అప్పుడే లక్ష్మీనారాయణులవలె ప్రియమైనవారిగా అవ్వగలుగుతారు.
గీతము: ఓం నమ:శ్శివాయ.......
ధారణకొరకు ముఖ్యసారము:
1.ధర్మరాజు శిక్షలనుండి రక్షించుకునేందుకు, స్మృతిలో ఉండేందుకు గుప్తమైన పురుషార్ధం చేయాలి. స్వయాన్ని బిందువైన ఆత్మగా భావిస్తూ బిందువైన తండ్రిని స్మృతిచేయడమే పావనులుగా అయ్యేందుకు ఉపాయము.
2. ఙ్ఞానములో అన్నీ తెలిసినవారిగా భావించకండి. ఏకరసస్థితిని తయారుచేసుకునేందుకు అభ్యాసము చేయాలి. బాబా ఇచ్చిన ఆఙ్ఞపై నడవాలి.
వరదానము: కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులుగా లూజ్ కనెక్షన్ను సరిచేసుకునే సమస్యాముక్తభవ.
అన్ని సమస్యలకు మూలకారణము కనెక్షన్ లూజవ్వడం. కేవలం కనెక్షన్ను సరిచేసుకున్నట్లైతే సర్వశక్తులు మీ ముందు తిరుగుతూ ఉంటాయి. ఏదైనా కనెక్షన్ను జోడించడంలో ఒకటి , రెండు నిమిషాలు పట్టినా కానీ ధైర్యాన్ని కోల్పోయి కన్ఫ్యూజ్ అయిపోకండి. నిశ్చయమురూపీ పునాదిని చలింపజేయకండి. నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా నావారు - అన్న ఈ ఆధారము ద్వారా పునాదిని దృఢంగా చేసినట్లైతే సమస్యాముక్తులుగా అయిపోతారు.
స్లోగన్: బీజరూపస్థితిలో స్థితులైపోవడము - ఇదే పాత సంస్కారలను పరివర్తనచేసే విధి.
No comments:
Post a Comment